Posted on 2026-07-14 03:38:14
డైలీ భారత్ డెస్క్: పల్లెటూర్లో ప్రజలు ముఖ్యంగా రైతులకు ఎదురయ్యే ప్రమాదాల్లో ప్రముఖమైనది పాము కాటు.
మన ప్రాంతాల్లో ఉండే అత్యంత విషసర్పాల్లో ప్రముఖంగా మూడు రకాలే ఎక్కువగా మనకు ఎదురవుతుంటాయి.
తాచు పాము, రక్తపింజరి, కట్లపాము, ఈ మూడింటి కాట్లే మనిషి ప్రాణాలను తీస్తుంటాయి.
పాము కాటు వేసిన గంటలోపే ఆసుపత్రులకు వెళ్తే ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది.
ఇలాంటి సందర్భాల్లో మారు మూల గ్రామాల ప్రజలు సరైన సమయంలో ఆసుపత్రులకు వెళ్ల లేక ప్రాణాలు కోల్పోతుంటారు.
వారి కోసం ప్రభుత్వం ఇక పై 108 లోను పాముకాటుకు ఇంజక్షన్లు ఉంచింది.
ప్రభుత్వం చేసిన ఈ కొత్త ఆలోచనతో ఎంతోమంది రైతులు, ప్రజలు సకాలంలో ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది.
ఎవరికి ఏ సమయంలో ప్రమాదం జరిగిన,సమాచారం అందుకున్న కొద్ది సమయం లోనే 108 వాహనం అక్కడ ఉంటుంది.
ఈ 108 కు ఎక్కువగా యాక్సిడెంట్ కేసులే వస్తుంటాయి.
దానికి సంబంధించిన మందులే అందులో ఉంటాయి.
అత్యవసర చికిత్సలు చేసేందుకు అనుకూలమైన విధంగా 108 వాహనాలను సిద్ధం చేశారు.
ఇక పై 108 లో పాము కాటు కు సంబంధించిన ఇంజక్షన్లు కూడా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >