Posted on 2026-07-14 13:21:15
ప్రభుత్వ కార్యాలయంలో కొత్త సంస్కృతి. "మనమందరం సమానమే" అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన తహసిల్దార్ శ్రీనివాస్
డైలీ భారత్, పెద్దాపురం, కాకినాడ జిల్లా: ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణంగా కనిపించే దృశ్యాలకు భిన్నంగా పెద్దాపురం తహసిల్ కార్యాలయంలో ఇప్పుడు కొత్త వాతావరణం కనిపిస్తోంది.
తహసిల్దార్ శ్రీనివాస్ తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ప్రజల్లో పెద్ద చర్చకు దారితీసింది. కార్యాలయానికి వచ్చే వారు చేతులు కట్టుకోవడం, కాళ్లు పట్టుకోవడం, ఏడవడం వంటివి చేయవద్దని కార్యాలయం బయట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
"మనం అందరం సమానమే" అనే సందేశంతో ఉన్న ఈ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
ఇప్పటివరకు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ ఇలాంటి ప్రకటన చూడలేదని స్థానికులు చెబుతున్నారు. పనుల కోసం వచ్చే సామాన్యుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయం స్వాగతించదగినదని అంటున్నారు.
అంతేకాకుండా తహసిల్దార్ శ్రీనివాస్ అర్జీదారుల సమస్యలను ఓపికగా విని, వెంటనే సిబ్బందితో మాట్లాడి పరిష్కారం చూపిస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
"అధికారి అంటే భయం కాదు, సేవకుడు" అనే భావనను ఈ ఒక్క ఫ్లెక్సీతో ఆయన ముందుకు తెచ్చారు. ఈ తరహా చర్యలు ఇతర కార్యాలయాలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
#Peddapuram #Tahsildar #Kakinada #PublicService #AndhraPradesh
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >