Posted on 2026-07-14 09:33:44
డైలీ భారత్, పెద్దపల్లి: మున్సిపల్ పనుల బిల్లులు ఇప్పించేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ అధికారి ACB కి చిక్కాడు.
పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీశ్, మున్సిపల్ పరిధిలో జరిగిన పనుల బిల్లును విడుదల చేసేందుకు ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు అందుకున్న ACB DSP మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్లాన్ తో ట్రాప్ ఏర్పాటు చేశారు. ఒప్పందం ప్రకారం సతీశ్ లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అనంతరం AE సతీశ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.
పెద్దపల్లిలో పెరుగుతున్న ACB కేసులు
ఇటీవల కాలంలో పెద్దపల్లి జిల్లాలో అవినీతిపై ACB ఉక్కుపాదం మోపుతోంది. గత ఏడాది జూలైలో పంచాయతీ రాజ్ AE పి. జగదీష్ బాబు రూ. 90 వేలు, ఫిబ్రవరిలో మంథని సబ్ రిజిస్ట్రార్ రూ. 16,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
ప్రజలకు ACB విజ్ఞప్తి
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే భయపడకుండా వెంటనే ACB కి ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.
టోల్ ఫ్రీ: 1064
వాట్సాప్: 94404 46106
ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ACB స్పష్టం చేసింది.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >