Posted on 2025-11-22 16:18:43
డైలీ భారత్ న్యూస్, పిఠాపురం:అక్రమ సంబంధం వలన భార్యను హత్య చేసిన భర్తను గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు.శనివారం గ్రామీణ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో డిఎస్పి మురళీకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకార పిఠాపురం వాసి కిలిమి శివశంకర్ రెడ్డి, విజయవాడ పెనమలూరు గ్రామానికి చెందిన శివపార్వతి ప్రేమ వివాహం చేసుకొని కుటుంబ జీవనం కొనసాగిస్తున్నారు.పిఠాపురంలో కొంతకాలం, అనంతరం విజయవాడలో కాపురం ఉంటూ స్వీట్ షాప్లో స్వీట్లు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. వ్యాపారంలో నష్టం రావడంతో తాత్కాలికంగా ప్రాంతం మార్చుకున్న ఈ దంపతుల మధ్య విభేదాలు తీవ్రం కాగా, శివపార్వతికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్టు శంకర్ రెడ్డికి సమాచారం తెలుసుకున్నారు.ఈ నేపథ్యంలో ఎర్రబాలెం గ్రామానికి చేరుకున్న శంకర్ రెడ్డి, ఆమె గురించి విచారణ జరిపి అక్రమ సంబంధం నిజమని తెలుసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కోపంతో గత నాలుగు రోజుల క్రితం తెరపాలం ప్రాంతంలో శివపార్వతిని గొంతునులిమి హత్య చేసి పరారయ్యాడు..ఈ విషయం పై మృతురాలి అన్న ఫిర్యాదు ఆధారంగా రూరల్ ఎస్సై వెంకట్ దర్యాప్తు ప్రారంభించి, గ్రామీణ సీఐ పర్యవేక్షణలో నిందితుడు శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు డి.ఎస్.పి సిహెచ్ మురళీకృష్ణ వెల్లడించారు.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >