Posted on 2025-11-12 04:18:19
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశానుసారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖాళీగా ఉన్న మండల అధ్యక్ష పదవులకు జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు కొత్త అధ్యక్షులు నియమించారు అందులో భాగంగా జూలూరుపాడు మండలంలో పార్టీ కోసం పనిచేసిన ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన చాపల మడుగు రామ్మూర్తిని నియమించారు.,కానీ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారము ఆ కమిటీని రద్దు చేశారు. తాజాగా ఖాళీగా ఉన్న మండలాల్లో అధ్యక్షులుగా నియమించుకోండి అని రాష్ట్ర నాయకత్వం ఆదేశించడంతో ఈ పదవి మరలా చాపల మడుగు రామ్మూర్తికే వరించింది. ఈ సందర్భంగా చాపలమడుగు రామ్మూర్తి మాట్లాడుతూ పార్టీ ఆదేశానుసారము నడుచుకుంటానని అన్నారు . కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రజలకు 6 గ్యారంటీలు హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, మండల కేంద్రంలో ఉన్న సమస్యల గురించి అధికారులను నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని మండల అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సదాశివనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >
సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి
Posted On 2026-07-26 14:47:28
Readmore >
జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం
Posted On 2026-07-26 14:40:51
Readmore >
భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్
Posted On 2026-07-26 14:34:52
Readmore >
గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
Posted On 2026-07-26 14:33:18
Readmore >