Posted on 2025-11-09 20:22:41
హాజరైన అర్బన్ ఎమ్మెల్యే
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరంలోని 19 వ డివిజన్ కంటేశ్వర్లో శ్రీ మహాలక్ష్మి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి బోనాల పండుగ వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు. డివిజన్లో ని భక్తులు, ముఖ్యంగా మహిళ భక్తులు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై భక్తిపూర్వకంగా బోనం ఎత్తుకొన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాలక్ష్మి అమ్మవారి బోనాలు తెలంగాణ సాంప్రదాయ సంస్కృతికి అద్దం పడుతున్నాయన్నారు. ప్రజల ఐకమత్యం, భక్తి, సాంస్కృతిక విలువలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగలను మనందరం భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ,” అని తెలిపారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రాంతమంతా భక్తి సందడితో నిండింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నాగోల్ల రవి, కంటేశ్వర్ మండల ప్రధాన కార్యదర్శి మేకల సాయి ప్రవీణ్, ఎల్లమ్మ తల్లి మండల ప్రధాన కార్యదర్శి బెండ ప్రసాద్, బిజెపి నాయకులు గుండు రవి, సాయిరాం, సాయిలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >