Posted on 2026-05-25 15:48:11
ఈ నెల 26న చలో హైదరాబాద్కు పిలుపు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు లైసెన్స్లు కేటాయించి పని చేయించుకుంటున్నప్పటికీ, తగిన వేతనాలు ఇవ్వడం లేదని తెలంగాణ రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్ది శామ్ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా శామ్ మాట్లాడుతూ.. లైసెన్స్ సర్వేయర్లకు కనీస పని భరోసా కల్పించడంతో పాటు గౌరవ వేతనం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము కష్టపడి చేసిన పనికే వేతనం కోరుతున్నామని, ఇది ఎలాంటి అధిక కోరిక కాదని, తమ గౌరవప్రదమైన హక్కు అని పేర్కొన్నారు. తమ హక్కుల సాధన కోసం ఈ నెల 26న “చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించే లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వేయర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎకరానికి రూ.50 కమీషన్ పద్దతితో కుటుంబ పోషణ కష్టతరంగా మారుతుందని, ప్రభుత్వం మా పట్ల ఊదాసీనతతో ఆలోచించి గౌరవ వేతనం ప్రకటించి ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుగులోత్ విక్రమ్ కుమార్, జనరల్ సెక్రటరీ కబీర్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >
రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్కు వినతి పత్రం
Posted On 2026-07-28 14:02:59
Readmore >
కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు
Posted On 2026-07-28 14:01:16
Readmore >