| Daily భారత్
Logo




డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు

News

Posted on 2026-07-28 17:30:20

Share: Share


డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు

10 మందికి ఒక రోజు జైలు, 3 మందికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా

మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే జైలు శిక్షతో పాటు జరిమానా తప్పదు.

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్  

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై దృష్టి సారించి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ కఠిన చర్యలు చేపడుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో 71 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడగా, వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు ₹81,500 జరిమానా విధించింది. అదేవిధంగా 10 మందికి ఒక రోజు జైలు శిక్ష, 3 మందికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్  మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమైన చర్య అని తెలిపారు. మద్యం ప్రభావంలో డ్రైవింగ్ చేయడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయి తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయని, క్షణిక నిర్లక్ష్యం జీవితాంతం పశ్చాత్తాపానికి కారణమవుతుందని అన్నారు. ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు, చట్టపరమైన చర్యలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ తెలిపారు.

మద్యం సేవించి వాహనం నడపడం నేరం. మీ భద్రతతో పాటు ఇతరుల ప్రాణాల భద్రత కోసం కూడా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించండి.

Image 1

కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్

Posted On 2026-07-28 17:42:20

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు

Posted On 2026-07-28 17:30:20

Readmore >
Image 1

మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్ ఆ తరవాత మహిళ మృతి

Posted On 2026-07-28 17:22:38

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-07-28 17:21:37

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు

Posted On 2026-07-28 17:20:49

Readmore >
Image 1

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింతలపూడి యుగంధర్ మృతి

Posted On 2026-07-28 17:11:57

Readmore >
Image 1

మైనారిటీ గురుకులం విద్యార్థిని కాపాడిన ఆర్టీసీ

Posted On 2026-07-28 15:57:51

Readmore >
Image 1

రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం

Posted On 2026-07-28 14:02:59

Readmore >
Image 1

కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

Posted On 2026-07-28 14:01:16

Readmore >
Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >