| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం

కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం

73 మందికి కోర్టు శిక్షలు, 10 మందికి జైలు శిక్షలు & రూ.97,500 జరిమానా.

జిల్లా వ్యాప్తంగా తనిఖీలు - రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం .. మద్యం సేవించి వాహనం నడిపితే జైలుకే..! 

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు కొనసాగుతాయి.   

జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, ఐపిఎస్  

డైలీ భారత్, కామారెడ్డి:  కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, ప్రజల ప్రాణాలను రక్షించడం లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మొత్తం 73 మందికి కోర్టు శిక్షలు విధించడం జరిగింది. పట్టుబడిన వారిని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు వారికి మొత్తం రూ.97,500 జరిమానా విధించింది. అదేవిధంగా కోర్టు నలుగురికి ఒక రోజు జైలు శిక్ష, ఐదుగురుకి రెండు రోజుల జైలు శిక్ష మరియు ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్  మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్షణిక ఆనందం కోసం చేసే నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెడుతుందని, వాహనదారులు మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించి మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం ఇలాగే కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Previous జీవ నదులను కాపాడుకోకపోతే భవిష్యత్తే ఉండదు : పవన్ కళ్యాణ్
Next హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ADVERTISEMENT