Posted on 2026-05-25 16:24:35
ట్రాక్టర్ నడుపుతూ యాతాలకుంట టన్నెల్ పనులు పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో కలెక్టర్ల కృషి అభినందనీయం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగమైన యాతాలకుంట టన్నెల్ పనులను రాష్ట్ర వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ TSతో కలిసి మంత్రి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ టన్నెల్ పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టులో భాగంగా పంపుహౌస్లు, ప్రధాన కాలువలు, టన్నెల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. యాతాలకుంట టన్నెల్ ద్వారా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందించి లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. మొత్తం సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ప్రస్తుతం టన్నెల్ లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని, ఈ వర్షాకాలంలోనే సత్తుపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అదేవిధంగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు మరియు అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేశారని మంత్రి అభినందించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు నిర్వహించారని తెలిపారు.
ప్రాజెక్టు మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
#SitaramaProject #GodavariWater #Irrigation #Agriculture #TelanganaFarmers #BhadradriKothagudem #Khammam #PrajaPalana #Telangana
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >