Posted on 2025-09-21 16:34:49
బతుకమ్మ వేడుకల్లో మాజీ ఎంపీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత లేని లోటు స్పష్టంగా కనిపించిన వైనం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లో ఆదివారం సాయంత్రం బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాసవీ కన్యకా పరమేశ్వరీ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి మండపంలో మహిళలు బతుకమ్మ వేడుకుల నిర్వహించారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా మహిళలు ఆడిపాడారు. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో మహిళలు మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ ఆడపడుచులు ఈ పండగను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఘనంగా నిర్వహించుకునే వేడుకలకు గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లేని లోటు ఆమె అభిమాన, అనుచరుల వర్గాల్లో నిరాశనే మిగిలింది. ఇటీవల పార్టీలో నెలకొన్న విభేదాలు, పార్టీ నుండి సస్పెండ్ అయిన కవిత తన స్వగ్రామంలోనే బతుకమ్మ వేడుకలను నిర్వహించుకున్నారు. ఆమె అధికారంలో ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా ఆడపడుచులందరూ బతుకమ్మ సంబరాలను ఎంతో ఆర్భాటంగా ఘనంగా నిర్వహించేవారు. నిజానికి కవిత అత్తగారు నిజామాబాద్ కు చెందిన వాసులే అయినప్పటికీ ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి బతుకమ్మ సంబరాలు బోసిపోయినట్లుగా ప్రారంభించడం జరిగిందని ఆమె సన్నిహితులు తెలిపారు.
హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
Posted On 2026-08-31 04:01:07
Readmore >
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >