Posted on 2026-08-31 04:01:07
డైలీ భారత్, హైదరాబాద్: శంషాబాద్ శివార్లలోని తుక్కుగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న యువ నర్సును గొంతు నులిమి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హత్య అనంతరం మృతదేహంపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన యువతి ఈ ఏడాది జనవరిలోనే తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రి యాజమాన్యం నర్సుల కోసం ఆస్పత్రికి దూరంగా మెకానిక్ షెడ్ల వెనుక విశ్రాంతి గదులు ఏర్పాటు చేసింది.
శుక్రవారం రాత్రి బాధితురాలు ఒంటరిగా గదిలో ఉండగా, సమీప మెకానిక్ షాపులో పనిచేసే బీహార్ కు చెందిన సైనా ఉల్లా (35) కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
శనివారం ఉదయం తోటి నర్సు తలుపు తట్టినా తెరవకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా యువతి విగతజీవిగా పడి ఉంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
నిందితుడు సైనా ఉల్లాను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన 2024 కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటనను తలపిస్తోందని పోలీసులు పేర్కొన్నారు.
మహిళా సిబ్బంది గదుల వద్ద కనీస భద్రత లేకపోవడమే ఈ దారుణానికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. కిటికీలకు గ్రిల్స్ కూడా లేకపోవడంతో నిందితుడు సులభంగా లోపలికి వెళ్లాడని చెబుతున్నారు.
హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
Posted On 2026-08-31 04:01:07
Readmore >
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >