| Daily భారత్
Logo




సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

News

Posted on 2026-08-30 18:04:50

Share: Share


సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద జరిగిన గొడవ కలకలం రేపింది. పెళ్లి వేడుకకు వచ్చి దూషిస్తూ దాడి చేసి చంపుతామని బెదిరించారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల BY నగర్ కు చెందిన K. శ్రావణ్ కుమార్ కు గతంలో గోదావరిఖనికి చెందిన సౌమ్యతో వివాహం జరిగింది. అనంతరం భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో సౌమ్య గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో భర్తపై గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టింది. ప్రస్తుతం ఆ కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయి.

ఈ క్రమంలో శివనగర్ శివాలయం వద్ద శ్రావణ్ కుమార్ సోదరి వివాహం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న సౌమ్య తన తల్లిదండ్రులు, సోదరుడు మరికొందరితో కలిసి అక్కడికి వచ్చింది. సౌమ్యను కాపురానికి ఎందుకు తీసుకెళ్లడం లేదంటూ వాగ్వాదానికి దిగినట్లు శ్రావణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనను, తన బంధువులను అసభ్య పదజాలంతో దూషిస్తూ చేతులతో దాడి చేశారని, సౌమ్యను కాపురానికి తీసుకెళ్లకపోతే చంపుతామని బెదిరించి భయభ్రాంతులకు గురిచేశారని బాధితుడు ఫిర్యాదు చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >
Image 1

ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్

Posted On 2026-08-30 17:15:04

Readmore >
Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >
Image 1

వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్

Posted On 2026-08-30 13:59:15

Readmore >
Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >