Posted on 2025-07-18 16:27:43
స్నేహ సొసైటీ సిద్దయ్య, స్నేహ సొసైటీ అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి లు వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది బోనాలు అని స్నేహ సొసైటీ సిద్దయ్య, స్నేహ సొసైటీ అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి అన్నారు. శుక్రవారం నగరంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఆవరణంలో సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మొదట స్నేహ సొసైటీ ఆవరణలో డప్పులతో బోనాలు ఎత్తుకొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మ వారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆడపడుచులకు తాంబూళం అందజేసి ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ స్నేహ సొసైటీ నుండి హౌసింగ్ బోర్డు కాలోనీ పోచమ్మ మందిరానికి ఊరేగింపుగా తరలివెళ్లారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం, వస్తాలు, నైవేద్యాలు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆనందోత్సహాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని అన్నారు. స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బోనాల పండగ నిర్వహించడం ఎంతో శుభ సూచకమని అమ్మవారి దయ వివిధ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, అవరోధాలు లేకుండా ఎలాంటి మహమ్మారిలు రాకుండా చూడాలని కోరారు. సమృద్ధిగా వర్షాలు కురిసి సిరిసంపదలతో విరజిల్లాలని కోరుతూ అమ్మవారికి బోనాలను సమర్పించుకోవడం జరిగిందని అన్నారు. రైతులు, సైనికుల తో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అందులో మనం ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. బోనాలు కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లు, వంశీ ప్రియ, సుచి ప్రశాంతిలు బోనాలు ఎత్తుకున్నారు.
ఈ కార్యక్రమంలో మానసిక దివ్యంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి కోఆర్డినేటర్ కిరణ్మయి స్నేహ టీవీ ప్రోగ్రాం మేనేజర్ బాలరాజు ట్రాంజెండర్ల నాయకులు జరీనా, గంగా, శ్యామల, ఆరతి, పాల్గొన్నారు. వీరితోపాటు స్నేహ టి ఐ జిఎన్ఎమ్ కౌన్సిలర్ అవుట్ రీచ్ వర్కర్లు, ఫీల్ ఎడ్యుకేటర్లు, మహిళ సెక్స్ వర్కర్లు పాల్గొన్నారు
గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్
Posted On 2026-03-08 13:28:05
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-08 11:17:27
Readmore >
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >