Posted on 2026-03-08 11:57:45
డైలీ భారత్, సిరిసిల్ల: పరాభవ నామ ఉగాది కవి సమ్మేళనం వచ్చే మార్చి 18 న జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనం లో నిర్వహించ నున్నట్లు మానేరు రచయితల సంఘం ప్రతినిధులు డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్, గెంట్యాల భూమేశ్, ఆడెపు లక్మన్ ఒక ప్రకటనలో తెలిపారు..
సంప్రదాయాన్ని అనుసరించి ఉగాది కవి సమ్మేళనం నిర్వహించేందుకు మానేరు రచయితల సంఘం సంకల్పించింది. ఇందుకోసం ఆసక్తి గల కవి, రచయితల నుంచి ఉగాది కవితలను ఆహ్వానిస్తున్నాం.
ఔత్సాహికులు ఎవరైనా కవితా గానం చేయొచ్చునన్నారు . గానం చేసే కవితలు ముందుగానే తెలియజేయాలి.
పండుగ నేపథ్యం, ప్రాశస్త్యం, జన జీవనం పై ఋతువులో మార్పుల ప్రభావం, రాబోయే కాలంలో సాంఘిక జీవనం ఎలా ఉండాలని ఆశిస్తూ.. పండుగ, ప్రజల్లో కొత్త మార్పులకు చోటు కల్పించాలనే ఆకాంక్షతో ఉండాలి.
మూస ధోరణికి భిన్నంగా ఉండాలి.
ఎంపిక చేసిన కవితలను మాత్రమే గానం చేయాలి.
కవులు తమ కవితలను మార్చి 15 లోపు
98491 57752
నెంబర్ కు వాట్సప్ లో పంపించాలి.
గతం లో గానం చేసినవి, పత్రికల్లో అచ్చయినవి కాకుండా నూతనంగా, నవ్యత్వం ఉట్టి పడేలా కవితల రచనలుండాలి.
పాల్గొన్న ప్రతి కవికీ సంఘం పక్షాన సత్కారం ఉంటుంది. గడువు తరువాత అందిన కవితలు పరిశీలించ బడవు అని గెంట్యాల భూమేశ్, డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్ ఆడెపు లక్మన్అధ్యక్ష, కార్యదర్శులు మానేరు రచయితల సంఘం, సిరిసిల్ల తెలిపారు.
గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్
Posted On 2026-03-08 13:28:05
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-08 11:17:27
Readmore >
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >