Posted on 2025-07-18 10:37:40
డైలీ భారత్, వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఉద్రిక్తత నెలకొంది. ఆరుగ్యారంటీలు ఇంకా లబ్ధిదారులకు అందట్లేదని భారత రాష్ట్ర సమితి నేతలు ఆరోపించారు. మరోవైపు లబ్ధిదారులను ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి నివాసానికి తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. ఈక్రమంలో వేల్పూర్ వెళ్లేందుకు యత్నించిన కాంగ్రెస్ నేత మోహన్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. భారత రాష్ట్ర సమితి నాయకులను సైతం గృహ నిర్బంధం చేశారు. గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. భారత రాష్ట్ర సమితి నాయకులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి ముందే ఆపివేశారు. ఈక్రమంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >