Posted on 2025-07-18 10:37:40
డైలీ భారత్, వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఉద్రిక్తత నెలకొంది. ఆరుగ్యారంటీలు ఇంకా లబ్ధిదారులకు అందట్లేదని భారత రాష్ట్ర సమితి నేతలు ఆరోపించారు. మరోవైపు లబ్ధిదారులను ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి నివాసానికి తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. ఈక్రమంలో వేల్పూర్ వెళ్లేందుకు యత్నించిన కాంగ్రెస్ నేత మోహన్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. భారత రాష్ట్ర సమితి నాయకులను సైతం గృహ నిర్బంధం చేశారు. గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. భారత రాష్ట్ర సమితి నాయకులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి ముందే ఆపివేశారు. ఈక్రమంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-08 11:17:27
Readmore >
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >