Posted on 2025-07-18 09:05:36
డైలీ భారత్, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్పేట్ ప్రశాంత్హిల్స్ కాలనీలో చెందిన మర్రి వెంకటేశ్వర్లు(47) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. కొంతకాలంగా అతను రియల్ ఎస్టేట్తో పాటు బిల్డర్గానూ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
ఇటీవల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో అతను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంజాపూర్లోని సాయిప్రియ కాలనీలో ఉన్న ఫ్లాట్లోని గదిలో తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విగతజీవిగా యజవనిఇ కనబడటం చూసిన వెంకటేశ్వర్లు సూపర్వైజర్ బి.రాజు పోలీసులతో పాటు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు
పోలీసులు.. స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది. తాను ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడు సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
Posted On 2026-05-02 22:26:17
Readmore >
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >