| Daily భారత్
Logo




పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం దారుణం

News

Posted on 2025-07-08 17:54:51

Share: Share


పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం దారుణం

ఉన్నత చదువులు చదువుకోవాలన్న విద్యార్థుల కళ కళగానే మిగిలిపోతుంది..

జాగృతి తెలంగాణ నాయకులు,కేర్ కళాశాల అధినేత నరాల సుధాకర్

డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు పేద విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు, కేర్ కళాశాల అధినేత నరాల సుధాకర్ విమర్శించారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి అధ్యక్షతన యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మొదటి మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చెయ్యకపోవడం వలన విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనేక సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన కనీస స్పందన లేదని అన్నారు. అలాగే నేటి విద్యార్థులంతా ఆన్లైన్ గేమ్ లకు సోషల్ మీడియాకు బానిస కావద్దని దానివల్ల విద్యార్థి దశలో ఉన్న యువత తమ విలువైన భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు. భారతదేశం గర్వించదగా పౌరులుగా ఎదగాలని సూచించారు. అదేవిధంగా యుఎస్ఎఫ్ విద్యార్థి సంఘం విద్యార్థుల పక్షాన అలుపెరుగని పోరాటాలు చేస్తూ అనేక సమస్యల్ని పరిష్కరించే రకంగా కృషి చేస్తుందని ఇలాంటి విద్యార్థి సంఘాలలో విద్యార్థులు చేరి సమాజాభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. అనంతరం యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి  పెద్ది సూరి మాట్లాడుతూ ప్రభుత్వ విద్య రంగ బలోపేతానికి, ప్రభుత్వ రంగ సమస్యలను పరిష్కారానికి, ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థల దోపిడి అరికట్టడానికి సెప్టెంబర్ నెలలో యూఎస్ఎఫ్ఐ తెలంగాణ మొదటి రాష్ట్ర మహాసభల వేదికపై ఉద్యమ కార్యచరణ రూపొందించుకొని మహనీయులు కోరుకున్న సమసమాజ స్థాపన దిశకై పోరాటాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బాదం తిరుపతి, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు వెంకటేష్, రాజేష్, మధు,నాగేష్, తిరుపతి, గణేష్, యుఎస్ఎఫ్ఐ నిజాంబాద్ జిల్లా నాయకులు మహేష్ వేణు గణేష్ బాబురావు శివ, జవహార్,ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Image 1

వివాహేతర సంబంధం కోసం భర్తను సజీవ దహనం చేసిన భార్య

Posted On 2026-04-16 11:11:21

Readmore >
Image 1

డబ్బు కోసం క్లాస్‌మేట్‌ కిడ్నాప్‌..

Posted On 2026-04-14 19:28:05

Readmore >
Image 1

అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న డిజిపి

Posted On 2026-04-14 19:15:28

Readmore >
Image 1

సిరిసిల్ల విద్యుత్ శాఖ ఎస్‌ఈగా టి. వేణుమాధవ్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-04-14 18:35:16

Readmore >
Image 1

విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం

Posted On 2026-04-14 18:28:08

Readmore >
Image 1

సత్తా చాటిన సెస్ బాలికల జూనియర్ కళాశాల ,సిరిసిల్ల : జిల్లాలోనే ప్రథమ స్థానం

Posted On 2026-04-14 18:02:15

Readmore >
Image 1

జులూరుపాడు మండలం చండుగొండ క్రాస్ రోడ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 135 వ జయంతి వేడుకలు

Posted On 2026-04-14 16:38:34

Readmore >
Image 1

జూలూరుపాడు మండలం లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు

Posted On 2026-04-14 15:44:35

Readmore >
Image 1

కొల్లేరు పెద్దింట్లమ్మ...

Posted On 2026-04-14 15:03:37

Readmore >
Image 1

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి

Posted On 2026-04-14 14:51:33

Readmore >