డైలీ భారత్, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల నూతన ఎస్సైగా జి.జ్యోతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై గణేష్ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్కు బదిలీ కావడంతో, ఆయన స్థానంలో జ్యోతి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతలను కాపాడటంతో పాటు, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News
ముస్తాబాద్ మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి