Posted on 2025-07-08 16:48:43
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జడ్.పి.హెచ్.ఎస్ గీతానగర్ ఉన్నత పాఠశాల మద్రాస్ ఐఐటి నిర్వహిస్తున్న స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాంకు ఎంపికైంది. ఈ భాగస్వామ్యం ద్వారా పదో తరగతి విద్యార్థులు రాబోయే రెండేళ్ల పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ల చే ఆన్లైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ ఫౌండేషన్ కోర్సుల ప్రాథమిక అంశాలు కోడింగు ను నేర్చుకోనున్నారు. ఇది విద్యార్థులకు ఐఐటీలో చేరడానికి అవసరమైన ప్రాథమిక జ్ఞానాన్ని అందిస్తుంది ఈ అవకాశంతో విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని ప్రధానోపాధ్యాయులు శారద గారు తెలిపారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >