Posted on 2026-04-18 22:34:02
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ వద్ద విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో లవ్ జిహాద్ కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేయడం జరిగింది,
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అనేక నగరాలలో(నాసిక్, హైదరాబాదు, బెంగుళూరు, ఢిల్లీ, లక్నో) లవ్ జిహాద్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. అమాయక హిందూ అమ్మాయిల్ని కార్యాలయాలు, కాలేజీలలో ముస్లిం యువకులు పరిచయం చేసుకొని మాయమాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, మోసం చేసి పెళ్లి చేసుకుని వారి జీవితాలు నాశనం చేస్తూ లవ్ జిహాద్ కి పాల్పడుతున్నారు, ఇలాంటి సంఘటనల వల్ల లక్షలాదిమంది హిందూ అమ్మాయిలు వారి జీవితాలు ఆగం చేసుకోవడమే కాక కుటుంబాలతో సంబంధాలు కోల్పోతున్నారు, ఇదంతా ఉగ్రవాద మనస్తత్వం కలిగినటువంటి కొంతమంది జిహాదీ ముస్లింలు ప్రణాళిక ప్రకారం హిందూ అమ్మాయిలని లక్ష్యంగా చేసుకొని వారిని ప్రలోభ పెట్టి, మోసం చేసి, మూడో పెళ్లిలో.. నాలుగో పెళ్లిలో.. చేసుకుని వారి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కూడా అత్యాచారం చేపిస్తూ.. హిందూ అమ్మాయిల పట్ల అత్యంత వికృతంగా ప్రవర్తిస్తున్నటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో దేశంలో అనేకం వెలుగు చూశాయి. స్త్రీని అత్యంత పవిత్రంగా ఆరాధించే భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరమని ఇలాంటి లవ్ జీహాద్ సంఘటనల వల్ల హిందూ సమాజం బలహీనపడటమే కాక దేశ భద్రతకు కూడా చాలా ప్రమాదకరం, కనుక వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని భారతదేశం నుండి లవ్ జిహాద్ మూకల్ని తరిమికొట్టాలని విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అథిదిగా పాల్గొన్నటువంటి విశ్వహిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత్ తెలంగాణ ప్రాంత సహా ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,
బజరంగ్దళ్ జిల్లా సంయోజక్ కూసన సాగర్ మాట్లాడుతూ.. లవ్ జీహాద్ పట్ట హిందూ అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలనీ, ముస్లిం అబ్బాయిల మోసపు మాటలు నమ్మవద్దనీ అన్నారు, అనంతరం భారత రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్మూ జిల్లా కలెక్టర్ ద్వారా మొమెరాండం పంపిస్తూ కలెక్టర్ కార్యాలయం లోని పరిపాలన అధికారికి మెమొరాండం అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు, విభాగ్ మాతృశక్తి సంయోజిక రేగడి విజయలక్ష్మి , విశ్వహిందూ పరిషత్ జిల్లా సంఘటన కార్యదర్శి గంగాధరి సీత , బజరంగ్దళ్ జిల్లా గోరక్ష ప్రముఖ్ దేవేందర్ , జిల్లా ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ వింజమూరు మురళి , జిల్లా సామాజిక సమరసత ప్రముఖ్ గొడ్ల రాజయ్య , పాల్వంచ ప్రఖండ ఉపాధ్యక్షులు చల్లా లింగన్న , పాల్వంచ ప్రఖండ కార్యదర్శి దాసరి మాధవరావు , పాల్వంచ ప్రఖండ సహా కార్యదర్శి వేములపల్లి ప్రవీణ్ , పాల్వంచ ప్రఖండ మాతశక్తి సంయోజిక మంద వెంకటరమణ , కొత్తగూడెం ప్రఖండ కార్యదర్శి అగుల్ల యాకయ్య , చర్ల ప్రఖండ ఉపాధ్యక్షులు జట్టి వెంకటేశ్వర్లు , కొత్తగూడెం ధర్మప్రసార్ కార్యకర్త ఆగుళ్ల సుజాత , చుంచుపల్లి ప్రకండ బజరంగ్దళ్ విద్యార్థి ప్రముఖ్ మోక్ష మరియు మరికొందరు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >