Posted on 2026-04-19 06:48:18
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఎంఎంటీఎస్లో అందరికీ ఉచిత ప్రయాణం?
జూన్ 2 నుంచి పథకం అమలుకు ప్రభుత్వ సన్నాహాలు
ఏటా రూ.10 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన రాష్ట్ర సర్కార్
తొలుత ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో, ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని యోచిస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు.
ప్రస్తుతం నగరంలో 80 నుంచి 88 ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రమే నడుస్తుండగా, రోజుకు సుమారు 40 వేల మంది ప్రయాణిస్తున్నారు. సమయపాలన లోపించడం, ట్రిప్పుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆదరణ తగ్గింది. ఉచిత ప్రయాణ పథకం అమలైతే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >