Posted on 2026-04-19 10:18:18
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఎంఎంటీఎస్లో అందరికీ ఉచిత ప్రయాణం?
జూన్ 2 నుంచి పథకం అమలుకు ప్రభుత్వ సన్నాహాలు
ఏటా రూ.10 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన రాష్ట్ర సర్కార్
తొలుత ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో, ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని యోచిస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు.
ప్రస్తుతం నగరంలో 80 నుంచి 88 ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రమే నడుస్తుండగా, రోజుకు సుమారు 40 వేల మంది ప్రయాణిస్తున్నారు. సమయపాలన లోపించడం, ట్రిప్పుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆదరణ తగ్గింది. ఉచిత ప్రయాణ పథకం అమలైతే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >