Posted on 2026-04-18 13:53:21
సర్టిఫికెట్లు అందించి అభినందించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : జాతీయ రహదారి భద్రతా (రోడ్ సేఫ్టీ) మాసోత్సవాల సందర్భంగా భాగంగా వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అభినందించారు. జాతీయ రహదారి భద్రతా (రోడ్ సేఫ్టీ) మాసోత్సవాల సందర్భంగా
పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆద్వర్యంలో ఈ ఏడాది జనవరి 1 వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు చేయించారు. అలాగే జిల్లాలోని పలు విద్యాసంస్థల విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా చర్యలపై వ్యాస రచన, క్విజ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించగా, పలువురు విద్యార్థులు ప్రతిభ చూపారు.
ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అభినందించారు. వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా చర్యలపై కుటుంబ సభ్యులకు, సమీప ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ కుమార్, వివిధ పాఠశాలల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >