Posted on 2025-07-08 16:33:29
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: చట్టాలపై సంపూర్ణమైన అవగాహన పెంచుకునేందుకు ప్రతి మహిళా ముందుకు రావాలనీ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ అన్నారు.
మంగళవారం గోపాల్ నగర్ లోని పంచాయతీరాజ్ అతిధి గృహ సముదాయంలోని సమావేశ మందిరంలో డీఎల్ఎస్ఏ చేర్మెన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. నీరజ ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాధికా జైస్వాల్ మాట్లాడుతూ ఇంటా బయటా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న మహిళల భద్రత, సంక్షేమం కోసం రూపొందించబడిన పలు మహిళా చట్టాల్లోని కీలకాంశాల గురించి మహిళలకు అవగాహన కల్పించారు. గృహ హింస, వరకట్న నిషేధం, బాల్య వివాహాలకు సంబంధించిన చట్టాలను ప్రస్తావించారు. సర్దుకుపోలేని సమస్యల కారణంగా కుటుంబంలోని కలతల్ని. దంపతుల మధ్య సర్దుబాటు లేమి వంటి సమస్యలను తమ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పరిష్కరించుకోవచ్చునన్నారు. స్త్రీ. పురుష సమానత్వ సాధన ప్రక్రియలో ముందుకు సాగుతున్న తరుణంలో వివక్ష ఏ స్థాయిలో ఉన్నా చట్టం నుంచి రక్షణ పొంద వచ్చునన్నారు. అదే సమయంలో చట్టం కల్పించిన అవకాశాన్ని దుర్వినియోగం చేసే వారి విషయంలోనూ న్యాయస్థానం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ సమస్వయంతో జరిగిన ఈ సమావేశంలోల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్సభ్యులు ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు, న్యాయవాదులు ఇ. జ్యోతి, కె. తిరుపతి, అలేఖ్య, ఆర్ అరుణ, గెంట్యాల భూమేశ్ తదితరులు మాట్లాడారు. 19వ వార్డుకు సంబంధించిన సుమారు 100 మంది మహిళలు పాల్గొన్నారు.
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >