డైలీ భారత్, కామారెడ్డి : రోజున కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన పెరికకుల సంఘం జిల్లా అధ్యక్షులు పోతరాజు వెంకటేశ్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా పెరిక కులం కామారెడ్డి జిల్లా కు చెందిన ఎస్ ఎస్ సి మరియు ఇంటర్మీడియట్, Eapcet లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం కార్యక్రమం నిర్వహించిన పెరిక సంఘం రాష్ట్ర మరియు జిల్లా నాయకులు
శాలువా మెమెంటో లో తో ఘనంగా సన్మానించడం జరిగిందిమరియు వెయ్యి రూపాయలు నగదు బహుమతి అందించడం జరిగింది
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు ఆటలు మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు మరియు సమాజానికి ఉపయోగపడేలా మంచి స్థానంలో ఉండాలని పిలుపునిచ్చారు
ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ముత్తినేని వీరయ్య వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, లక్కర్స్ ప్రభాకర్ వర్మ పెరిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, నిజామాబాద్ జిల్లా పెరుక సంఘం అధ్యక్షుడు మైదం రాజన్న, జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ బాల ప్రసాద్ పాల్గొన్నారు
మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్ల భాస్కర్, ముఖ్య సలహాదారు మర్రి శేఖర్ జిల్లా ప్రచార కార్యదర్శి నరెడ్ల లింగం,ఉపాధ్యక్షులు నల్లపు రమేష్, ముఖ్య సలహాదారు భూసాని సత్యనారాయణ,దోమకొండ మాజీ ఎంపిటిసి నల్లపు శ్రీనివాస్, దోమకొండ మాజీ ఎంపీపీ కానుగంటి శారద నాగరాజు, పెద్ద చక్కెరగా గ్రామ వార్డు సభ్యురాలు సురేఖ,కామారెడ్డి పట్టణ పెరిక సంఘ అధ్యక్షులు మద్ద మల్లేశం, మరియు సంఘం నాయకులు బసవలింగం, గంగరాజు చక్రపాణి కిష్టయ్య రాజు తిరుపతి, తదితరులు మరియు ఆయా గ్రామాల అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు