Posted on 2025-07-08 17:56:11
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదో టౌన్ పరిధిలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని 80 క్వాటర్స్ కు చెందిన సాలుంకే రత్నదీప్ గంజాయికి అలవాటుపడి అధిక డబ్బులు సంపాదించాలనుకున్నాడు. తెలిసిన వారి దగ్గర గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. సమాచారం తెలసుకున్న పోలీసులు డ్రైవర్స్ కాలనీలో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతని వద్ద 5ప్యాకెట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నిషేధిత గంజాయిని ఎవరైనా కమిషనరేట్ పరిధిలో ఎవరైనా విక్రయించినట్టు, కొనుగోలు చేసినట్లు, దాన్ని సేవించిన వారిపై కఠిన చర్యలు తీర్చుకుంటామని ఆయన హెచ్చరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >