Posted on 2026-02-28 19:39:47
వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారుల నేర సమీక్షా సమావేశం
గంజాయి రహిత నగరంగా మారుద్దాం
గంజాయిను విక్రయించే కీలక వ్యక్తులను పట్టుకోండి.
అక్రమ ఇసుక రవాణాకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించండి
డైలీ భారత్, వరంగల్: దేశ భవిష్యత్తుయిన యువత గంజాయి మత్తు బానిసలు కాకుండా గంజాయి వియ్రించే మూలాలపై దృష్టి పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల నేర సమీక్షా సమావేశాన్ని శనివారం కాకతీయ మెడికల్ కళాశాలో ఏర్పాటు చేసారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ముందుగా పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులు, వారెంట్లు, అధికారులు, సిబ్బంది పనితీరుపై వరంగల్ పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పొలీస్ కమిషనర్ నేరాల నియంత్రణకై తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తూ కమిషనరేట్ పరిధిలో పేకాటరాయుళ్ళపై కఠినంగా వ్యవహరించాలని, ప్రధానంగా శివారు ప్రాంతాల్లో స్థానిక పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలని,చోరీలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లను తెరవాలని, అధికంగా చోరీలు జరిగే ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని, అదే విధంగా యం.జి.యం, రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లో సైతం సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు, కృషి చేయాలని, స్టేషన్ అధికారులు తమ పరిధిలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్కు అనుసంధానం చేయాలని, గంజాయి వినియోగదారున్ని పట్టుకోవడంతో మన బాధ్యత అయిపోతుందని అనుకొంకుండా గంజాయిని వియ్రించే వారి గుర్తించి అరెస్టు చేయాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, అక్రమ ఇసుక రవాణాపై స్టేషన్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని, ఎవరైన ఆలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని, అలాగే రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారులు దృష్టి పెట్టాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్,రాజమహేంద్ర నాయక్,కవిత, శుభంనాగ్తో పాటు అదనపు డిసిపిలు, ఏసిపిలు, ఇన్స్స్పెక్టర్లు, అర్.ఐలు ఎస్.ఐలు పాల్గోన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >