Posted on 2026-02-28 17:14:48
డైలీ భారత్, సిరిసిల్ల: ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిరిసిల్ల యందు జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమానికి 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా వచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చకినాల శ్రీనివాస్ విద్యార్థులు తయారుచేసిన ఎగ్జిబిట్స్ ను పరిచయం చేశారు. అనంతరం కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా నూతన ఆలోచనలను, ప్రశ్నించడం ద్వారా శాస్త్రీయ ఆలోచన పెంపొందుతుందని తెలియజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చకినాల శ్రీనివాస్ మాట్లాడుతూ, విజ్ఞాన శాస్త్రం మానవ అభివృద్ధికి మూలం అని ఈరోజు మనం పొందుతున్న అధునాతన టెక్నాలజీ పూర్తిగా సైన్స్ అభివృద్ధి ఫలాలు అని తెలిపారు. మూఢనమ్మకాలు నమ్మవద్దని ఏదైనా శాస్త్రీయంగా పరిశీలించి నిజనిర్ధారణ చేయాలని తెలియజేశారు. బయట దొరికే ఆహార పదార్థాలు, వాటి వల్ల జరిగే నష్టాలు ముఖ్యంగా శీతల పానీయాల వల్ల మన శరీరాన్ని అది ఎంత కృంగదీస్తుందో సవివరంగా తెలియజేశారు. ఎగ్జిబిట్స్ తయారీలో పిల్లలు ఎలా కష్టపడ్డారో తెలియజేస్తూ, పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు తూముల తిరుపతి మరియు రాజగోపాల్ రెడ్డి కృషిని అభినందించారు. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న శాస్త్రీయ అభివృద్ధి, చంద్రయాన్ 2 విజయవంతం కావడంలో శాస్త్రజ్ఞుల కృషిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బైరి రవీందర్,T తిరుపతి, వడాల రవీందర్, రాజగోపాల్ రెడ్డి, ప్రభాకర్ , రాజేశం , డేవిడ్సన్ , రమాదేవి, రాధిక, నిరోషా , విజయలక్ష్మి , CRP దేవేందర్ , అనిల్, రాజు,పాల్గొన్నారు.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >