Posted on 2025-06-20 21:26:06
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ టి.అనిల్ కుమార్ కుటుంబానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ వారు కోటి రూపాయల చెక్కును జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ చేతుల మీదుగా అందజేశారు.పోలీస్ శాలరీ ప్యాకేజీ అకౌంట్ ద్వారా యూనిఫాం సర్వీస్ కస్టమర్ల సంక్షేమానికి స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా వారు ప్రవేశపెట్టిన స్కీం ద్వారా వచ్చిన నగదును అనిల్ కుమార్ గారి కుటుంబానికి ఈ రోజు అందజేశారు.ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ ఎం.సత్యనారాయణ, చీఫ్ మేనేజర్ ఆంజనేయ రమేష్ మరియు బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర్లు సమక్షంలో ఎస్పీ చేతుల మీదుగా ఈ చెక్కును అందజేశారు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశానికి సేవ చేస్తున్న ధైర్యవంతులైన సిబ్బందికి మరియు వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ స్కీం పోలీస్ శాఖలోని ప్రతి ఉద్యోగికి చాలా ప్రయోజనకరమని ఈ సందర్బంగా SBI బ్యాంకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >