Posted on 2026-03-01 18:26:22
డైలీ భారత్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరమ్మతులు చేసి అభివృద్ధి చేసిన పోలీస్ అతిథి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి, IPS ఆదివారం ప్రారంభించారు. ఈ సాయంత్రం హన్మకొండ పోలీస్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న డిజిపి గారు వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన డిజిపి అనంతరం పునరుద్ధరించిన ఆధునిక సదుపాయాలతో రూపొందించిన పోలీస్ అతిథి గృహాన్ని ప్రారంభించారు.
పోలీస్ శాఖ అధికారుల, అతిథుల వసతి సౌకర్యాలను మెరుగుపరచే దిశగా ఈ అతిథి గృహం పునర్నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆధునిక సదుపాయాలతో, సౌకర్యవంతమైన వాతావరణంలో రూపొందించిన ఈ అతిథి గృహం భవిష్యత్లో శాఖకు మరింత ఉపయోగకరంగా ఉండనుందని డిజిపి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిషనరేట్కు చెందిన డీసీపీలు అంకిత్ కుమార్, కవిత, శుభం నాగ్, అదనపు డీసీపీ లు రవి, శ్రీనివాస్, సురేష్ కుమార్, తో పాటు ఏసీపీలు ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >