Posted on 2026-03-01 18:19:42
ఘనంగా ఆత్మీయ సమ్మేళనం
స్నేహబంధాలు బలోపేతం
డైలీ భారత్, కామారెడ్డి: బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని ఇంద్రప్రస్థ వెంచర్లో బిబిపేట మండలం మాందాపూర్ 2000–2001 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల స్నేహ బంధాన్ని సిల్వర్ జూబ్లీగా ఘనంగా జరుపుకున్నారు. ఆత్మీయ వాతావరణంలో నిర్వహించిన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉత్సాహభరితంగా సాగింది.
పావు శతాబ్దం తర్వాత కలుసుకున్న సహాధ్యాయులు పాఠశాల రోజుల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చిన్ననాటి స్నేహాలు, గురువుల బోధనలు, ఆడిపాడిన క్షణాలను తలుచుకుంటూ నవ్వులు పూయించారు. కొందరు తమ అనుభవాలను పంచుకుంటూ జీవిత ప్రయాణంలో స్నేహం ఎంత విలువైనదో వివరించారు.కార్యక్రమం సందర్భంగా పరస్పరం సన్మానాలు, స్మృతిచిహ్నాల అందజేత, కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భవిష్యత్తులో ప్రతి ఐదేళ్లకోసారి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి స్నేహబంధాలను మరింత బలపరచాలని నిర్ణయించారు.స్నేహం అనే బంధం కాలాన్ని దాటిపోతుందని ఈ సిల్వర్ జూబ్లీ సమ్మేళనం మరోసారి చాటి చెప్పింది.ఈ కార్యక్రమంలో అంకన్న గారి గంగాధర్ గౌడ్, చింతకుంట సుధాకర్ రెడ్డి, గజ్వేల్ విజయ్ కుమార్, యాచం సంతోష్ కుమార్, గజ్వేల్ ఉదయ భాస్కర్, గురజాల సంతోష్ కుమార్, అయిత భాస్కర్, గంగమని, స్రవంతి, రజిత, సరిత, పెద్ద ధనలక్ష్మి, చిన్న ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >