Posted on 2025-05-12 19:18:38
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం 22 వ వార్డు గణేష్ నగర్, తారకరామనగర్, పెద్ద బోనాల, తుక్కారావుపల్లె కు చెందిన పలువురికి CMRF చెక్కులను స్థానిక మాజీ కౌన్సిలర్ కల్లూరి లత-మధు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కల్లూరి లత-మధు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం లాంటిదని, పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చెక్కు అందుకున్న లబ్దిదారులు మాజీ మంత్రి వర్యులు, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుకి, చెక్కు మంజూరికి కృషి చేసిన మాజీ కౌన్సిలర్ కల్లూరి లత -మధు కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మంచే మల్లయ్య, కారంపూరి సురేందర్, బొల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >