| Daily భారత్
Logo




వ్యక్తి ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి చంపుతామని బెదిరించిన కేసులో ఐదుగురికి జైలు శిక్ష, జరిమానా

News

Posted on 2025-05-12 19:35:05

Share: Share


వ్యక్తి ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి చంపుతామని బెదిరించిన కేసులో ఐదుగురికి జైలు శిక్ష, జరిమానా

ఒక వ్యక్తి యొక్క ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి చంపుతామని బెదిరించిన కేసులో ఐదుగురికి 02 సం.జైలు  శిక్షతో, ఒక్కొక్కరికి 6000/- రూ. జరిమానా

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఒక వ్యక్తి యొక్క ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి వారి యొక్క ప్రహరీ గోడ కూలగొట్టి తిట్టి చంపుతామని బెదిరించిన కేసులో ఐదుగురు వ్యక్తులకు రెండు సంవత్సరాల కఠిన కారగల శిక్షతోపాటు ఒక్కొక్కరికి 6000 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ స్థాయి న్యాయమూర్తి ప్రవీణ్ సోమవారం తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపినారు.

ఈ మేరకు సి.ఐ మాట్లాడుతూ.. 

సిరిసిల్ల పట్టణం చంద్రంపేట గ్రామానికి చెందిన అరుణ ఇంటి  నెంబర్ 2-97 లో ఇల్లు కలదు.అరుణ ఇంటి చుట్టూ కాళీ ప్రదేశం ఉన్నందున  గ్రామ పంచాయతీ వారి అనుమతితో ప్రహరీ గోడను నిర్మించుకోగా ఎర్ర మల్లేశం అనే వ్యక్తి తన భూమిలో ప్రహరీ గోడను కట్టినారు అని ఎర్ర రాజవ్వ ,ఎర్ర సుజాత ,ఎడవల్లి మల్లవ్వ ,జింక దేవావ్వ,ఎర్ర మల్లేశం వారితో కుమ్మక్కై తేదీ.28.3.2018 రోజున పగలు ఒకటిన్నర గంటలకు అరుణ ఇంటికి వద్దలేనిది చూసి ఇంటి వెనక ప్రహరీ గోడను కూలగొట్టగా అది చూసిన చూసి కర్రె కర్రె పోచవ్వ వచ్చి అరుణకు చెప్పగా అరుణ పోచవ్వ వెళ్ళి ఎందుకు గోడ కూలగొట్టుతున్నారని అడగగా పై వారు అరుణ మరియు పోచవ్వ ను తిట్టుకుంటూ గడ్డపారతో పొడిచి గాయపరచుటకు ప్రయత్నించినారు ఇట్టి సంఘటన చూసి  నర్మేట లక్ష్మణ్, రగుడు లక్ష్మణ్ వచ్చి వారి నుండి కాపాడగా పై ఐదుగురు ఎప్పటికైనా చంపుతామని బెదిరించినారని సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి విచారణ అధికారి కేసు నమోదు చేసి విచారణ అనంతరం ఎండి లియాకతలి కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు. సి.ఎం.ఎస్  శ్రావణ యాదవ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ 11 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టినారు ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలుమల్ల సందీప్ వాదించగా కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఏ.ప్రవీణ్ గారు నేరస్తులు ఆయన రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి 6000 రూపాయల జరిమానా విధించడం జరిగిందని సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపారు.

Image 1

ముగ్గురు కూతుళ్లను హతమార్చిన కసాయి తండ్రి

Posted On 2026-03-08 09:16:57

Readmore >
Image 1

మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి

Posted On 2026-03-08 08:40:36

Readmore >
Image 1

సగానికి పైగా రేట్లు తగ్గిన కోడి గుడ్లు...

Posted On 2026-03-08 08:39:29

Readmore >
Image 1

వడ్డీ ఆశ చూపి రూ. 25 కోట్లు మోసం: లేడీ పరార్

Posted On 2026-03-08 08:38:31

Readmore >
Image 1

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Posted On 2026-03-07 21:33:43

Readmore >
Image 1

పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి

Posted On 2026-03-07 21:31:59

Readmore >
Image 1

చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

Posted On 2026-03-07 21:29:26

Readmore >
Image 1

బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు

Posted On 2026-03-07 21:28:26

Readmore >
Image 1

మహిళల సాధికారతే సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-03-07 21:24:13

Readmore >
Image 1

సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు

Posted On 2026-03-07 21:22:31

Readmore >