Posted on 2026-04-28 04:03:42
డైలీ భారత్ స్పెషల్:
అడుగులు ఆగకూడదు...
పల్లె జాతరల్లో మోగే డప్పు శబ్దం
మొదలైతే…
పిల్లలు, పెద్దలు అందరూ చేరి
చూసేది ఒకటే — నృత్యం…
అది మన విలువల జీవిత కథ..!
చెప్పుల్లేని కాళ్లు
మట్టి నేలపై పడే ప్రతి అడుగు
కేవలం నాట్యం కాదు…
ఒక మన జీవితం కథ..!
కూచిపూడి అడుగు వేస్తే
పురాణం మాట్లాడుతుంది…
భరతనాట్యం తిరిగితే
దేవాలయం శ్వాస తీసుకుంటుంది..!
జానపద నాట్యం మొదలైతే
పల్లె గుండె కొట్టుకుంటుంది..!
కానీ…ఇప్పుడా డప్పు శబ్దం మెల్లగా తగ్గుతోంది…
చప్పట్లు మెల్లగా మాయమవుతున్నాయి..!
వేదిక మీద నర్తించే చేతులు
ఇంట్లో ఖాళీ పాత్రలు పట్టుకుంటున్నాయి..!
చప్పట్ల కోసం ఎదురు చూసిన కళ్లలో
ఇప్పుడు జీవన పోరాటం కనిపిస్తోంది..!
ఒక కళ కనుమరుగైతే
ఒక సంస్కృతి మసకబారుతుంది..!
పొట్ట కోసం...
కళను పక్కన పెట్టే రోజు వస్తే
అది ఒక మనిషి ఓటమి కాదు…
మన సంస్కృతి ఓటమి అవుతుంది..!
ఒక నర్తకి కన్నీరు కారిస్తే
ఒక జాతి ఏడుస్తోంది..!
వారి కాళ్లు ఆగిపోతే
మన కథ ఆగిపోతుంది అని గుర్తుంచుకో..!
వారి కళ మసకబారితే
మన మూలాలు మసకబారుతాయి
అని గుర్తుంచుకో..!
అందుకే…
మనం కూడా ముందుకు వచ్చి
వారి అడుగులకు చప్పట్లు కొట్టాలి..!
వారి కష్టాలకు వెలుగు ఇవ్వాలి
బావి తరాలకు ఈ కళను
కానుకగా అందించాలి..!
వేదిక దూరంగా అనిపించినా
మన హృదయం దగ్గరగా ఉండాలి..!
పల్లెలో మళ్లీ
డప్పు శబ్దం మోగాలి..!
మంజుల పత్తిపాటి కలం నుండి
జాలువారే ప్రతి కవిత
బావి తరాల కోసమే…
లయ ఆగకుండా ఉండాలని,
నృత్యం నిలిచేలా ఉండాలని
పదాలు నాట్యం చేస్తున్నాయి..!
ఒక అక్షరం లయ అయి
మరో అక్షరం తాళమయి
మంజుల కలం కదిలితే...
కాగితం మీద అడుగులు నాట్యం చేస్తున్నాయి..!
నృత్య కళాకారులు రాను రాను సరైన ఆదరణ లేక
కనుమరుగై పోతున్నారు.ఇంకా కొంతమంది ఆదరణ లేక పోయినా కళా వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. వారి ఆలన పాలన చూడాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వలదే...
మనం కూడా వారిని ప్రోత్సహించాలని
బావి తరాలకు కానుకగా అందించాలని కోరుకుంటూ
నృత్యంగా ప్రతి కళాకారుడికి (ఏప్రిల్ ఇరవై తొమ్మిది)
ప్రపంచ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు.
రచన : మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్
Posted On 2026-07-29 04:49:54
Readmore >
రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్
Posted On 2026-07-29 04:48:42
Readmore >
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >