Posted on 2025-05-12 17:57:44
చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు పని చేస్తున్న కానిస్టేబుల్ రాంబాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగినది. దివంగత పోలీసు సిబ్బంది కుటుంబాల అవసరాలు తీర్చడం లో భాగంగా పోలీసు చేయూత పథకం ద్వారా కానిస్టేబుల్ రాంబాబు కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల పోలీసు చేయూత పథకం చెక్కును ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు రాంబాబు కుటుంబ సభ్యులకు అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోలీసు శాఖ కృషి చేస్తుంది. రాంబాబు కుటుంబాన్ని పోలీస్ శాఖ అన్ని విధాల ఆదుకుంటుందని ఎస్పి తెలిపినారు. చేయూత పథకం నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బంది ప్రతి నెల జీతం నుండి విరాళం అందిస్తున్నారు అని అభినందించారు, పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు అన్నారు.
ఈ కార్యక్రమం నందు AR అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి గారు, సెప్షల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణరావు, పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, వెల్ఫేర్ RSI సాయిరాం, కుటుంబ సభ్యులు కిరణ్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
పోలీస్ ప్రజావాణి కార్యక్రమం.
పిర్యాదుదారులతో మాట్లాడి పిర్యాదులు పరిశీలించిన ఎస్పీ శ్రీ. కె నరసింహ ఐపిఎస్
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ అన్నారు.
సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పిర్యాదు దారులతో మాట్లాడి వారి అర్జిలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు ఎస్పి గారు మాట్లాడుతూ పిర్యాదుదారులకు బరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిదిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >