Posted on 2025-05-01 18:30:42
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు వారు మాట్లాడుతూ మా ఆదివాసి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నీ ప్రోటో కాల్ విషయంలో సంబంధిత అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా, ఎమ్మెల్యేకు చెప్పకుండా శంకుస్థాపన కార్యక్రమాన్ని జరిపించటం శోచనీయమని,ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,మంత్రి తుమ్మల నాగేశ్వరావు సమక్షంలోనే ఇలా జరగటం దురదృష్టకరమని, ఆదివాసి ఎమ్మెల్యే అని అధికారులు చిన్న చూపు చూడటం విచారకరమని అన్నారు, అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అవమానకరం ఎమ్మెల్యేకి జరిగి ఉండకపోవచ్చని అని అభిప్రాయం వ్యక్తం చేశారు,ఇతర మంత్రులకు గాని,ఎమ్మెల్యే కూడా ఇలా జరిగితే ఊరుకునేవారా అని ఆయన ప్రశ్నించారు, భవిష్యత్తులో ఇలాంటి అవమానాలు, జరక్కుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే నని అన్నారు,ఈ విషయాన్ని మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తామని నాయకులు తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో బండారి సూర్యనారాయణ తంబల రవి వాసం పోలయ్య పాల్గొన్నారు.
సిరిసిల్ల విద్యుత్ శాఖ ఎస్ఈగా టి. వేణుమాధవ్ బాధ్యతల స్వీకరణ
Posted On 2026-04-14 18:35:16
Readmore >
సత్తా చాటిన సెస్ బాలికల జూనియర్ కళాశాల ,సిరిసిల్ల : జిల్లాలోనే ప్రథమ స్థానం
Posted On 2026-04-14 18:02:15
Readmore >
జులూరుపాడు మండలం చండుగొండ క్రాస్ రోడ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 16:38:34
Readmore >
జూలూరుపాడు మండలం లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 15:44:35
Readmore >
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి
Posted On 2026-04-14 14:51:33
Readmore >