Posted on 2025-02-27 17:14:17
షాద్ నగర్ పట్టణ ముస్లిం ప్రముఖులు, నాయకులు
మున్సిపల్ కమిషనర్ సునీతకు వినతి పత్రం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మార్చు ఒకటి నుండి ప్రారంభం కాబోయే ముస్లిం ప్రజల రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని షాద్ నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల రూపకల్పనకు సంబంధిత శాఖ కృషి చేసే విధంగా సహకరించాలని పట్టణ ముస్లిం ప్రముఖులు నాయకులు స్థానిక కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, సీనియర్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం, సయ్యద్ ఖదీర్, ముబారక్ అలీ ఖాన్, అలీం, కబీర్, జాఫర్ తదితరులు మున్సిపల్ కమిషనర్ ను గురువారం స్వయంగా కలుసుకొని రంజాన్ మాసం సందర్భంగా జన్మదిన శాఖ ఏర్పాట్ల గురించి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. నెలరోజులపాటు ఉపవాస దీక్షల సందర్భంగా మంచినీరు, వీధుల్లో విద్యుత్తు దీపాలు ఆయా ముస్లిం బస్తీలలో రోడ్ల పారిశుధ్యం తదితర అంశాలను కమిషనర్ తో చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రార్థనా స్థలాల వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు..
రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం
Posted On 2026-05-09 21:25:28
Readmore >
భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Posted On 2026-05-09 21:24:43
Readmore >
ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..
Posted On 2026-05-09 17:26:47
Readmore >
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-09 12:22:25
Readmore >