Posted on 2026-05-09 17:26:47
ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం.. తీవ్రరక్తస్రావంతో పరిస్థితి విషమం
డైలీ భారత్, ఏలూరు: ఆధ్యాత్మిక బోధనలు చేయాల్సిన ఒక చర్చి పాస్టర్, బాలికపై వరుసగా అత్యాచారానికి పాల్పడి ఆమె ప్రాణాలతో చెలగాటమాడిన దారుణ ఘటన ఏలూరు జిల్లాలో వెలుగుచూసింది
నిందితుడు తన కామవాంఛను తీర్చుకోవడమే కాకుండా, బాలిక గర్భం దాల్చకుండా ఉండేందుకు బలవంతంగా గర్భనిరోధక మాత్రలను వాడించడంతో ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. కామవరపుకోట మండలానికి చెందిన చౌటపల్లి రాంబాబు (42) అనే వ్యక్తి స్థానికంగా చర్చి ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు నిర్వహిస్తుండేవాడు. నిరుపేద కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలికపై కన్నేసిన ఈ పాస్టర్, ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇటీవలే బాలికకు నెలసరి రాకపోవడంతో, ఆ పాస్టర్ స్వయంగా గర్భనిరోధక మాత్రలు తెచ్చి ఆమెతో అధిక మోతాదులో మింగించాడు. మాత్రల ప్రభావంతో బాలికకు విపరీతంగా రక్తస్రావం మొదలైంది. పరిస్థితి విషమించడంతో ప్రాణభయంతో బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లికి వివరించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా లేదని సమాచారం. ఈ క్రూరత్వానికి పాల్పడిన నిందితుడిని ఉరి తీయాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై వల్లీపద్మ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
#POCSO
ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..
Posted On 2026-05-09 17:26:47
Readmore >
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-09 12:22:25
Readmore >
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >