Posted on 2025-02-18 16:50:21
20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా మహబూబ్నగర్ ఏసీబీ బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది
డైలీ భారత్, ముక్తల్: మక్తల్ సర్కిల్ సీఐ జి చంద్రశేఖర్ ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీకి పట్టుబడ్డారు. 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా మహబూబ్నగర్ ఏసీబీ బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. మక్తల్ పట్టణంలో శ్రీనిధి కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ సంధ్యా వెంకట్ రాములు ఒక రేప్ కేసులో నిందితుడు. ఆయనకు ఇటీవలే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతి సోమవారం ఆయన మక్తల్ పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం పెట్టాల్సి ఉంది.
అయితే అనుకూలంగా చార్జిషీట్ వేస్తా అని చెప్పి లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం నాడు 20వేలు లంచం తీసుకుంటూ శివారెడ్డి, నరసింహ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీకి దొరికిపోయారు వీరితో పాటు సిఐ చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకొని మక్తల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. వారిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >
జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:21:35
Readmore >
సిరిసిల్ల : ఘనంగా భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం
Posted On 2026-05-05 16:16:41
Readmore >