| Daily భారత్
Logo




సరిపోని సరుకులు తీసుకెళ్లి సోషల్ మీడియాలో హల్చల్

News

Posted on 2024-09-04 21:30:01

Share: Share


సరిపోని సరుకులు తీసుకెళ్లి సోషల్ మీడియాలో హల్చల్

ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి విమర్శలు

దాడులను తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారు

మంత్రి సీతక్క పై ఎమ్మెల్సీ నవీన్ విసర్లు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా  : వరద బాధితులను ఆదుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు మానవతా దృక్పథంతో ముందుకు వస్తే కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారని దీనిని యావత్తు తెలంగాణ సమాజం ఖండిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. 

బుధవారం హైదరాబాద్ లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక కుటుంబానికి కూడా సరిపడా సరుకులు తీసుకెళ్లకుండా సోషల్ మీడియాలో సాయం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుందని నవీన్ కుమార్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు.

వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సాయం పదివేల రూపాయలు సొంతంగా చేస్తున్నారా లేదా ప్రభుత్వం నుండి ఇస్తున్నారా స్పష్టత ఇవ్వాలని అన్నారు. 

బాధితులకు కనీసం రెండు నెలలకు సరిపడా సరుకులు సరఫరా చేస్తే న్యాయం జరుగుతుందని అన్నారు. పదివేల రూపాయలు ప్రభుత్వం నుండి ఏమాత్రం సరిపోవని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. మంత్రి సీతక్క గతంలో వరదల సమయంలో ఎన్నో మాటలు మాట్లాడారని ఆనాడు హెలికాప్టర్ ఇస్తే సాయం చేస్తానని అడిగినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వము మంత్రులు అధికారము హెలికాప్టర్లు కూడా మీ వద్దే ఉన్నాయని మరి ఎందుకు సాయం చేయడం లేదని మీడియా ముఖంగా మంత్రి సీతక్కను ప్రశ్నించారు.

వరద వస్తుందని ఖమ్మం  ప్రజలకు ముందు చెప్పలేదు. ఇదే ప్రభుత్వ ఫెయిల్యూర్ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శనివారం 21 అడుగులకు నీటిమట్టం చేరింది, 21 అడుగులకు చేరిన ఒక ఇల్లు కూడా మునగదన్నారు. కాకపోతే నీటిమట్టం 18 అడుగులకు చేరగానే మైకులలో అనౌన్స్‌మెంట్ ఇచ్చి ట్రాక్టర్లు వ్యాన్లు తీసుకొచ్చి ప్రజలను సామగ్రితో సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.

ఆదివారం ఉదయం 33 అడుగులకు నీటిమట్టం చేరింది.

అప్పటికి ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు చేయలేదని ఆరోపించారు. ప్రజలే స్వచ్ఛందంగా అయ్యో రామచంద్ర అని అనుకుంటూ వారి సోమాగ్రిని వదిలేసి వేరే ప్రాంతంలోకి వెళ్లిపోయారన్నారు. మాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రజల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. రిలీఫ్ మెజర్స్ తీసుకోవడంలో బాధితులకు ఆహారం, నీళ్లు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి నాపై తప్పుడు ఆరోపణలు చేశారని పువ్వాడ అన్నారు..

Image 1

అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు

Posted On 2026-03-05 06:04:46

Readmore >
Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >
Image 1

స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె

Posted On 2026-03-04 21:01:53

Readmore >
Image 1

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-03-04 20:00:46

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవం

Posted On 2026-03-04 19:28:49

Readmore >
Image 1

కన్నకొడుకు గెంటేశాడు.. జిల్లా కలెక్టర్ కొడుకులా కాపాడారు..

Posted On 2026-03-04 18:36:56

Readmore >
Image 1

మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-03-04 18:30:50

Readmore >
Image 1

కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు

Posted On 2026-03-04 16:19:10

Readmore >
Image 1

38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్

Posted On 2026-03-04 16:16:19

Readmore >
Image 1

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

Posted On 2026-03-04 15:50:03

Readmore >