Posted on 2024-09-03 19:32:17
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వరద బాధితులకు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భారీ సాయం ప్రకటించారు. ఎమ్మెల్సీగా తన ఒక నెల జీతాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీ స్థాయిలో వచ్చిన వరదల కారణంగా దాదాపు 5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ మూడు జిల్లాల్లో జనజీవనం స్థంభించిందని, ప్రజల నిత్యావసరాలు వరదలో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నన్ను గెలిపించిన ప్రజలు కష్టాల్లో ఉన్న విచారకరమైన సందర్భంలో వరద బాధితులను ఆదుకోవడానికి ఎమ్మెల్సీగా తనకు వచ్చే నెల జీతం 2 లక్షల 75 వేల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. వరద భాదితులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలిపారు. అలాగే మిగిలిన ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా తమ నెల శాలరీ విరాళంగా ఇచ్చి వరద బాధితులను ఆదుకోవాలని తీన్మార్ మల్లన్న రిక్వెస్ట్ చేశారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >