Posted on 2024-09-02 12:36:30
నిర్వాసితులతో కలిసి గ్రామాన్ని సందర్శించిన
జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ.
డైలీ భారత్, గద్వాల: చిన్నోనిపల్లి గ్రామంలోకి రిజర్వాయర్ నుండి గ్రామంలోకి వరదనీరు చేరుకుంటుందని దీంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమని నివాసాలు ఉంటున్నాట్లు ఆందోళన చెందుతున్న విషయం తెలుసుకున్న జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ గ్రామస్థులతో కలిసి సందర్శించారు.
దీంతో గ్రామస్థులు తమ సమస్యలను సరితమ్మకు తెలుపుతూ సీప్టీంగ్ చార్జీలు ఇవ్వలేదని, ఆర్ అండ్ ఆర్ సెంటర్ లో విద్యుత్, తాగునీటి, మౌలిక సదుపాయాలు కల్పించ కుండా గ్రామాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని చిన్నోనిపల్లి గ్రామస్థులు కన్నీరు కారుస్తూ ఆవేదన వెలిబుచ్చారు...అనంతరం అక్కడికక్కడే బాధితుల సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారి ఈఈ రహీంవుద్దీన్ లతో చరవాణి ద్వారా సరితమ్మ మాట్లాడుతూ చిన్నోనిపల్లి రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు నష్టం జరుగక ముందే,ఆర్ అండ్ ఆర్ సెంటర్ ను వినియోగంలోకి తీసుకువచ్చి,వారికి పెండింగ్లో ఉన్న బిల్లు లను అందించాలని, గతంలో 18 సంవత్సరాల లోపు ఉన్న వారికి ప్లాట్లు ఇవ్వలేదని, ఇప్పుడు అలాంటి వారిని గుర్తించి నివాస గృహాల నిర్మాణం కోసం ప్లాట్లు మంజూరు చేయాలని అధికారులకు సరితమ్మ సూచించారు.
చిన్నోనిపల్లి గ్రామస్థులు ఎవరు కూడా అదైర్య పడవద్దని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒకరికి అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
వీరి వెంట చిన్నోనిపల్లి రిజర్వాయర్ నిర్వాసితులు, కాంగ్రెస్ పార్టీ మండల,గ్రామాల నాయకులు,అధికారులు తదితరులు ఉన్నారు
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >