Posted on 2024-07-14 12:00:18
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ఒడిశా రాష్ట్రం లోని పూరీ జగన్నాథుడి రత్న భాండా గారం మరికొద్ది గంటల్లో తెరుచుకోనుంది. 46 సంవత్సరాల తరువాత సంపద లెక్కింపు చేయ నున్నారు. ఇందుకోసం ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కొద్దిసేపట్లో జగ్ననాథ ట్రస్ట్ బోర్డు, ఆలయ వేద పండి తులు భేటీ కానున్నారు. ఆలయ ప్రవేశ ముహూర్తం ను ట్రస్ట్ సభ్యులు ఖరారు చేస్తారు. మధ్యాహ్నం 1గంటలకు శుభముహూర్తం ఉందని వేద పండితులు చెబుతున్నారు.
మరోవైపు రత్న భాండాగా రం తెరుస్తుండటంపై దేశ వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు.
ఒడిశాలోని పూరీ జగన్నా థుడి రత్న భాండాగారం తెరవాలని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16మందితో ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇవాళ మధ్యా హ్నం రహస్య గదిని తెరవనున్నారు.
సోమనాథ్ కమిటీ, జగన్నా థ్ ట్రస్ట్ కమిటీ, రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఆలయం వద్దకు చేరుకున్నారు. రహస్య గదిలోకి 16 మంది సభ్యుల బృందం వెళ్లనుంది. నిపు ణుల పర్యవేక్షణలో రత్న భాండాగారంను అధికా రులు తెరవనున్నారు.
భాండాగర్ లో విష సర్పాలు ఉండే అవకాశం ఉండటంతో నిపుణులైన స్నేక్ క్యాచర్స్ ను ప్రభుత్వం పిలిపించింది...
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >