Posted on 2024-04-06 18:12:15
పెద్దమ్మ బోనాల జాతరకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
డైలీ భారత్, కరీంనగర్ జిల్లా: హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని హుజూరాబాద్ లోని బోర్నపల్లి వద్ద శనివా రం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. టిప్పర్ బోల్తాపడి మట్టి మీద పడటంతో అన్నా చెల్లెలు అక్కడికక్కడే మృతిచెందారు.
తీవ్రంగా గాయపడిన మరో యువతి హుజూరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందు తూ మృతి చెందింది. బోర్నపల్లిలో పెద్దమ్మతల్లి బోనాల జాతర నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
మట్టి టిప్పర్ ఎలబోతారం నుంచి హుజూరాబాద్ కు వెళ్తుంది. బోర్నపల్లి మూల మలుపు వద్ద బ్రేక్ వేయడం తో టిప్పర్ అదుపుతప్పింది. టిప్పర్ బోల్తా పడటంతో బైక్ పై ఉన్న ముగ్గురిపై మట్టి పెల్లలు మీద పడి మృతి చెందారు...
మృతులను బోర్నపల్లికి చెందిన విజయ్, వర్ష, సింధుజగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు...
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >
సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు
Posted On 2026-03-07 21:22:31
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
Posted On 2026-03-07 20:16:11
Readmore >
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >