Posted on 2023-10-08 20:40:43
డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట :రోడ్డుపై నిలుచున్న ఆరేండ్ల పాపను స్కార్పియో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలంలో చోటు చేసుకుంది. కామారెడ్డి - సిరిసిల్ల ప్రధాన రోడ్డులోనీ గాజుల పల్లి శివారు బస్టాండ్ లో బస్సు కోసం వరంగల్ జిల్లాకు చెందిన కొట్టెం పద్మ కుటుంబ సభ్యులు వేచివున్న క్రమంలో స్కార్పియో అతి వేగంగా దూసుకువచ్చి రోడ్డుపై నిల్చున్న పద్మ కూతురు స్వాతి (6)ని డీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. సొంత అన్న కుటుంబ సభ్యులను చూడడానికి పద్మ కుటుంబ సభ్యులు గాజులపల్లి గ్రామానికి వచ్చారు. చూసి తిరుగు పద్మ ఇంటికి ప్రయాణమయ్యే క్రమంలో ఘటన జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి,విచారణ చేపట్టారు. సింగారం గ్రామానికి చెందిన షేక్ అజీజ్ కాంట్రాక్టర్, స్కార్పియోగా పోలీసులు గుర్తించారు. న్యాయం చేయాలని స్వాతి తల్లి పద్మ, కుటుంబసభ్యులు, బంధువులు కోరుతున్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
Posted On 2026-03-13 08:09:02
Readmore >
హైదరాబాద్లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది
Posted On 2026-03-12 21:53:55
Readmore >
శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం
Posted On 2026-03-12 21:52:35
Readmore >
కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
Posted On 2026-03-12 18:49:30
Readmore >
కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-03-12 18:47:14
Readmore >