Posted on 2023-10-07 18:02:49
డైలీ భరత్, రాజన్న సిరిసిల్ల: రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎక్సైజ్ శాఖ, పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారని ఎక్సైజ్ సిఐ ఎంపిఆర్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులతో ఎస్పీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేసినట్లు సిఐ తెలిపారు. నాటుసారాయి తయారు, రవాణా, సేవించే ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారన్నారు. నాటుసారాయికి ఉపయోగించే ముడి పదార్థాలైన బెల్లం, పటిక అమ్మేవారిని ముందే గుర్తించి సంబంధిత తహసీల్దార్ ల ముందు బొండోవర్లు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చేవారిపై కఠినంగా వ్యవరించాలని ఆదేశించారు. గంజాయి, మత్తు పదార్థాల సేవించే వారిపై, అక్రమ వ్యాపారం చేసేవారిపై రహస్యంగా సమాచారం సేకరించి , పట్టుకుని జైలుకు పంపించాలని ఎస్పీ ఆదేశించారన్నారు. సమావేశంలో ఎక్సైజ్ సిఐ లు గులామ్ ముస్తఫా, గుండేటి రాము, మరాఠీ పోష్ రాజ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >
అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్
Posted On 2026-03-13 16:39:38
Readmore >
నవజాత శిశు చిన్నారి తల్లులకు కిట్ల పంపిణీ చేసిన జిల్లా న్యాయ సేవల సంస్థ కార్యదర్శి నాగరాణి
Posted On 2026-03-13 14:50:53
Readmore >