Posted on 2023-10-07 18:02:49
డైలీ భరత్, రాజన్న సిరిసిల్ల: రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎక్సైజ్ శాఖ, పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారని ఎక్సైజ్ సిఐ ఎంపిఆర్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులతో ఎస్పీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేసినట్లు సిఐ తెలిపారు. నాటుసారాయి తయారు, రవాణా, సేవించే ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారన్నారు. నాటుసారాయికి ఉపయోగించే ముడి పదార్థాలైన బెల్లం, పటిక అమ్మేవారిని ముందే గుర్తించి సంబంధిత తహసీల్దార్ ల ముందు బొండోవర్లు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చేవారిపై కఠినంగా వ్యవరించాలని ఆదేశించారు. గంజాయి, మత్తు పదార్థాల సేవించే వారిపై, అక్రమ వ్యాపారం చేసేవారిపై రహస్యంగా సమాచారం సేకరించి , పట్టుకుని జైలుకు పంపించాలని ఎస్పీ ఆదేశించారన్నారు. సమావేశంలో ఎక్సైజ్ సిఐ లు గులామ్ ముస్తఫా, గుండేటి రాము, మరాఠీ పోష్ రాజ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >