Posted on 2023-10-07 14:31:46
ప్రతిపక్ష నేతననే హింసిస్తున్నారని ప్రశ్న
ఎంతటి న్యాయపోరాటానికైనా సిద్ధం
రైతు నేవురీ దేవేందర్ రెడ్డి ఆవేదన
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తాను బ్రతికుండగానే నన్ను చంపేశారని ఓ రైతు ఆవేదన చెందుతున్నాడు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నేవూరి దేవేందర్ రెడ్డి అనే రైతు స్థానిక కెడిసిసి బ్యాంకులో సుమారు ఐదు సంవత్సరాల క్రితం 84 వేల పంట రుణం తీసుకున్నాడు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి మిత్తి కూడా కడుతున్నాడు. అయితే తాజాగా ప్రభుత్వం పంట రుణమాఫీ చేసిన జాబితాలో అతని పేరు రాలేదు. దీనిపై తన రుణమాఫీ ఎందుకు చేయలేదని బ్యాంకు వారిని అడిగితే, వ్యవసాయ శాఖ అధికారులను కలవమని చెప్పారు. వ్యవసాయ అధికారులు "లోన్ సాంక్షన్డ్ ఆఫ్టర్ డెత్" అని తమ రికార్డులో ఉందని, దేవేందర్ రెడ్డి బతికిఉన్నట్లు సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పారు. దాంతో కంగుతిన్న దేవేందర్ రెడ్డి గ్రామ పంచాయతీ నుండి తాను బతికి ఉన్నానని సర్టిఫికెట్ వ్యవసాయ అధికారులకు అందించినట్లు తెలిపాడు. దీంతో దేవేందర్ రెడ్డి శనివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశంలో తన గోడు విన్నవించుకున్నాడు. తాను ప్రతిపక్ష పార్టీకి చెందిన వాడినని వేధిస్తున్నారా అంటూ ప్రశ్నించాడు. అధికారులు తన రుణ మాఫీ చేయని యెడల, ఎంతటి న్యాయ పోరాటానికి ఐనా సిద్దమని తెలిపాడు
గలిగే లక్ష్మయ్య(చంటి) చిత్రపటానికి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనిషా లక్ష్మీ మదన్లాల్
Posted On 2026-08-17 18:43:37
Readmore >
బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గెలిగే చంటి కుటుంబాన్ని పరామర్శించిన జూలూరుపాడు మండల బిఆర్ఎస్ నాయకులు
Posted On 2026-08-17 18:41:29
Readmore >
న్యూఢిల్లీలో ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యాలయంలో మద్దిశెట్టి బృందం సమావేశం
Posted On 2026-08-17 18:28:24
Readmore >
₹7 లక్షల క్రిప్టో మోసం... ఫేస్బుక్లో ఉచ్చు వేసి దోచుకున్న ముఠా గుట్టు రట్టు
Posted On 2026-08-17 15:32:36
Readmore >
రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి కోసం భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య!
Posted On 2026-08-17 15:17:48
Readmore >
అత్యవసర వేళలో ఆపన్నహస్తం... చిన్నారికి ప్లేట్లెట్స్ ఇచ్చిన బీజేపీ నేత సురేష్
Posted On 2026-08-17 15:01:32
Readmore >
పెళ్లి వేడుకను సేవగా మార్చిన దాతలు... వేములవాడ బాలికల పాఠశాలకు 200 స్టీల్ గ్లాసుల విరాళం
Posted On 2026-08-17 14:52:49
Readmore >