Posted on 2026-07-23 16:06:22
డైలీ భారత్, కొణిజర్ల : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి పంచాయతీ ఎల్లన్నగర్ గ్రామంలో గత 20 సంవత్సరాలుగా సీసీ రోడ్లు లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో బురద, వేసవిలో దుమ్ముతో నిత్యం అవస్థలు పడుతున్న ప్రజల సమస్యను గ్రామ సర్పంచ్ దంతాల ప్రశాంతి - నరసింహారావు గుర్తించి వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామ ప్రజల సమస్యను వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ ఎల్లన్నగర్ గ్రామానికి రూ.15 లక్షల విలువైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంజూరు చేశారు.
మంజూరైన నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దంతాల ప్రశాంతి - నరసింహారావు, ఉప సర్పంచ్ యుగంధర్, వార్డు సభ్యులు మహమ్మద్ సైదల్లి, లాల్ సింగ్, గ్రామ పెద్దలు సోములు మరియు గ్రామస్తులు పాల్గొని పనులను పరిశీలించారు.
గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేసి ప్రజల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్కు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
Posted On 2026-07-23 16:06:22
Readmore >
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి
Posted On 2026-07-23 16:04:59
Readmore >
వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-23 15:59:08
Readmore >
మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు
Posted On 2026-07-23 15:56:26
Readmore >
నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం
Posted On 2026-07-23 15:54:39
Readmore >
సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ
Posted On 2026-07-23 14:52:41
Readmore >
తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి
Posted On 2026-07-23 13:29:02
Readmore >