Posted on 2026-07-23 16:06:22
డైలీ భారత్, కొణిజర్ల : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి పంచాయతీ ఎల్లన్నగర్ గ్రామంలో గత 20 సంవత్సరాలుగా సీసీ రోడ్లు లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో బురద, వేసవిలో దుమ్ముతో నిత్యం అవస్థలు పడుతున్న ప్రజల సమస్యను గ్రామ సర్పంచ్ దంతాల ప్రశాంతి - నరసింహారావు గుర్తించి వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామ ప్రజల సమస్యను వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ ఎల్లన్నగర్ గ్రామానికి రూ.15 లక్షల విలువైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంజూరు చేశారు.
మంజూరైన నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దంతాల ప్రశాంతి - నరసింహారావు, ఉప సర్పంచ్ యుగంధర్, వార్డు సభ్యులు మహమ్మద్ సైదల్లి, లాల్ సింగ్, గ్రామ పెద్దలు సోములు మరియు గ్రామస్తులు పాల్గొని పనులను పరిశీలించారు.
గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేసి ప్రజల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్కు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >