Posted on 2026-04-23 16:56:02
డైలీ భారత్, నర్సంపేట: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య వరంగల్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ శంకర్ గౌడ్ తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
సమ్మె నేపథ్యంలో ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ, ఆయన తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ఈ ఘటనను గమనించిన సహచరులు మరియు స్థానికులు వెంటనే స్పందించి ఆయనను అడ్డుకొని ప్రాణాపాయం నుంచి కాపాడారు.
తీవ్ర గాయాలపాలైన శంకర్ గౌడ్ను వెంటనే చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.
ఈ ఘటనతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెరిగింది. సమ్మె కొనసాగుతున్న సమయంలో ఈ సంఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#warangal #suicide #rtc #rtc strike #rtc driver #narsampeta
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >
పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు
Posted On 2026-04-23 16:50:12
Readmore >