Posted on 2026-04-10 20:44:45
డైలీ భారత్, కామారెడ్డి: ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వయంప్రతిపత్తి కళాశాలలో పీజీ ప్రథమ మరియు తృతీయ సెమిస్టర్ ఫలితాలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ సంపత్ కుమార్ ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేస్తూ, విద్యార్థుల ప్రతిభను అభినందించారు.
ఈ సెమిస్టర్ ఫలితాల్లో కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. దాదాపు అన్ని విభాగాలలో 90 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదు చేశారు
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. "అధ్యాపకుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయి అని, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించి కళాశాలకు మరింత గుర్తింపు తీసుకురావాలి" అని సూచించారు.
వైస్ ప్రిన్సిపల్ మరియు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కె . కిష్టయ్య మాట్లాడుతూ..పరీక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణను పాటించడం వల్ల ఫలితాలను సకాలంలో విడుదల చేయగలిగాము అని,అటానమస్ హోదా పొందిన తర్వాత విద్యా ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, ఫలితాల్లోనూ నాణ్యత పెరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ అదనపు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ సంపత్, కళాశాల పరీక్షా విభాగం అధికారులు ఎన్. రాములు,ఏ.రాజేందర్ పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >